త్వరలో టీఆర్ఎస్ను ప్రజలు తరిమికొడ్తరు

త్వరలో టీఆర్ఎస్ను ప్రజలు తరిమికొడ్తరు

సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులలో మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన BJP ఎమ్మెల్యే రఘునందన్ రావును అడ్డుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. రఘునందన్ కారు ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

తనను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంపై బీజేపీ కార్యకర్తలతో కలిసి మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ లో నిరసన తెలిపారు రఘునందన్ రావు. అధికారం ఉందనే అహంకారంతో టీఆర్ఎస్ నేతలు గూండాలుగా వ్యవహరిస్తున్నారని..పోలీసుల అండతో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని..త్వరలోనే టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతారన్నారు రఘునందన్ రావు.

మరిన్ని వార్తల కోసం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

మూడు నెలల చిన్నారిని ఏడుసార్లు అమ్మిన్రు