అసద్..​ దమ్ముంటే గోషామహల్ నుంచి పోటీ చెయ్​ : ఎమ్మెల్యే రాజాసింగ్

అసద్..​ దమ్ముంటే గోషామహల్ నుంచి పోటీ చెయ్​ : ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు : ఎంఐఎం చీఫ్​  అసదుద్దీన్ ఒవైసీకి దమ్ముంటే గోషామహల్ నుంచి పోటీ చేయాలని.. లేకపోతే తన తమ్ముడినైనా పోటీ చేయించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. ఇక్కడి నుంచి వారిలో ఎవరు పోటీ చేసినా డిపాజిట్ లు  కూడా రావని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

అసదుద్దీన్ ఒవైసీ రాహుల్ గాంధీని హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారని, కానీ, ఆ కాంగ్రెస్ పెంచి పోషిస్తేనే ఆయన ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడని పేర్కొన్నారు. మహిళల గురించి మాట్లాడుతున్న ఒవైసీ.. పార్లమెంట్​లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశాడని రాజాసింగ్ ప్రశ్నించారు.  వారి తాత ముత్తాతలు అందరూ ముస్లింలను మోసం చేశారన్నారు.