
హైదరాబాద్, వెలుగు : ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి దమ్ముంటే గోషామహల్ నుంచి పోటీ చేయాలని.. లేకపోతే తన తమ్ముడినైనా పోటీ చేయించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. ఇక్కడి నుంచి వారిలో ఎవరు పోటీ చేసినా డిపాజిట్ లు కూడా రావని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
అసదుద్దీన్ ఒవైసీ రాహుల్ గాంధీని హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారని, కానీ, ఆ కాంగ్రెస్ పెంచి పోషిస్తేనే ఆయన ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడని పేర్కొన్నారు. మహిళల గురించి మాట్లాడుతున్న ఒవైసీ.. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశాడని రాజాసింగ్ ప్రశ్నించారు. వారి తాత ముత్తాతలు అందరూ ముస్లింలను మోసం చేశారన్నారు.