మున్సిపల్ ఎన్నికల్లో TRS దే గెలుపన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్…రాష్ట్రంలో TRS కు అధిక ప్రాధాన్యత ఉందన్నారు. తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకునే వారి నుంచి గట్టి పోటీ ఉందని ఆయన అన్నారు. అయితే అందరికీ అవకాశం ఇవ్వలేమని… టికెట్టు దక్కనివారు నిరాశ పడకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదేనన్నారు సీఎం కేసీఆర్.
టికెట్ రాని వారు బాధపడాల్సిన అవసరం లేదని … భవిష్యత్లో నామినేటెడ్ పదవులు, ఇతర అవకాశాలు ఉంటాయని తెలిపారు కేసీఆర్. ప్రతీ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మెల్యేలంతా ఎంతో కృషి చేయాలని ఆదేశించారు. కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులకు ఇవ్వాల్సిన A,B ఫారాలను ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ అందజేశారు.