బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్​రెడ్డి

బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు : మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సెగ్మెంట్​లో బీజేపీ తరఫున టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏ.వెంకటనారాయణ్ రెడ్డి (ఏవీఎన్ రెడ్డి​) పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్​సింగ్ బుధవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్​లో జరగనున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించారు. మార్చ్ లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏవీఎన్​రెడ్డితో పాటు మురళీమనోహర్​ పేర్లను కేంద్రానికి పంపగా.. ఏవీఎన్​రెడ్డి పేరును ఢిల్లీ నేతలు ఖరారు చేశారు. హైదరాబాద్ కి చెందిన ఏవీఎన్​రెడ్డి.. ప్రస్తుతం దిల్ సుఖ్ నగర్ ​పబ్లిక్ స్కూల్, ఏవీఎన్​ఇంజినీరింగ్ కాలేజీ, ఏవీఎన్ ​ఇంటర్నేషన్ స్కూల్ తదితర విద్యాసంస్థలకు చైర్మన్​గా కొనసాగుతున్నారు.