హైదరాబాద్, వెలుగు: బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. రాజ్ భవన్లో బస చేశారు. బుధవారం రాజ్ భవన్ నుంచి వేములవాడకు చేరుకుంటారు. ఉదయం 8 గంటలకు వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు.
అనంతరం 8:30 గంటలకు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా వేములవాడ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు వరంగల్ లో జరిగే సభలో ప్రసంగిస్తారు. మరోపక్క బుధవారం రాత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకుంటారు. గురువారం పొద్దున 9 గంటలకు భువనగిరిలో జరిగే సభకు అటెండ్ అవుతారు. ఈ నెల 9న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉదయం 9 గంటలకు వరంగల్ లో, తర్వాత బాన్సువాడలో ఉదయం 11 గంటలకు జరిగే సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.