పాత పెన్షన్ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

పాత పెన్షన్ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: రిటైర్డ్ ఉద్యోగులకు పాత పెన్షన్​ పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.  సోమవారం ఇందిరా భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 క్యాలెండర్ ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, టీచర్ల సంక్షేమమే ధ్యేయంగా పాత పెన్షన్​పునరుద్ధరణపై మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు చెప్పారు.

 అనంతరం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు హరి అశోక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీకి బొకే ఇచ్చి విషెష్​తెలిపారు. కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరబత్తిని శ్రీనివాస్, రమేశ్, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీలు నెరవేర్చుతాం 

పెగడపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్​ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం పెగడపల్లి మండలం బతికేపెల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన జీపీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కలెక్టర్​యాస్మిన్​బాషాతో 
కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్​ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమలుచేశామని, మిగతావాటికి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.