కామారెడ్డి, వెలుగు: జర్నలిస్టులకు అక్రిడిటేషన్కార్డుల జారీలో డీపీఆర్వో నిర్లక్ష్య వైఖరీని నిరసిస్తూ బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా చేశారు. కమిటీ అమోదించిన 273 అక్రిడిటేషన్కార్డుల్లో కొన్నింటిని మాత్రమే జారీ చేసి మిగతావి ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు.
అర్హులైన జర్నలిస్టులకు వెంటనే కార్డులు ఇవ్వాలని, డీపీఆర్వోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ఆశిష్ సంగ్వాన్కు వినతిపత్రం అందజేశారు. అర్హులైన వారికి కార్డులు అందేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆందోళనలో టీయూడబ్యూజే జిల్లా ప్రెసిడెంట్రజినీకాంత్, జనరల్ సెక్రటరీ తోట రాజేశ్, ట్రెజరర్ వెంకటేశ్తో పాటు జిల్లాలోని ఆయా ఏరియాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.
