హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నిర్వహించిన దీక్షా దివస్ టార్గెట్గా ‘ఎక్స్’లో కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పట్టించుకోకుండా ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ విమర్శించారు. ‘‘అధికారం కోల్పోయాక దీక్షా దివస్లు.. విజయ్ దివస్లు.. ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు’’ అని రాసుకొచ్చారు.

