ప్రయాణికులకు అలర్ట్ .. వారం రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

ప్రయాణికులకు అలర్ట్ ..  వారం రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. 2023 జూలై17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అంటే వారం రోజుల పాటు పలు ప్యాసింజర్ ట్రైన్స్ ,  ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా  ప్రకటించింది.  సికింద్రాబాద్ డివిజిన్ పరిధిలో మెయింటెన్స్ పనుల కారణంగా మొత్తం 22 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లుగా తెలిపింది.  ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించింది.  

రద్దు చేసిన వాటిల్లో లింగంపల్లి-హైదరాబాద్ మధ్య నడిచే రైళ్లు 12 ఉండగా.. మిగతావి లింగంపల్లి-ఉందానగర్ మధ్య నడిచే ట్రైన్లు ఉన్నాయి. లింగంపల్లి-హైదరాబాద్(47129, 47132, 47133, 47135, 47136, 47137) ట్రైన్లతో పాటు హైదరాబాద్ లింగంపల్లి (4711447105, 47108,47109, 47110, 47112) రైళ్లను రద్దు చేశారు. 

ఇక ఉదానగర్-లింగంపల్లి(47165), లింగంపల్లి-ఫలక్‌నుమా(47189), లింగంపల్లి-ఉదానగర్(47178,47181), లింగంపల్లి-ఫలక్‌నుమా(47179), ఫలక్‌నుమా-లింగంపల్లి(47158) ఎంఎంటీస్ ట్రైన్లు రద్దు అయ్యాయి.  మరోవైపు గుంటూరు డివిజన్ లో మెయింటెన్స్ పనుల కారణగా పది ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.