న్యూఢిల్లీ: డాలర్ విలువ బలపడటంతో మంగళవారం ఢిల్లీలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ నివేదిక ప్రకారం.. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.3,000 మేర తగ్గి రూ.1,49,300 వద్ద ముగిసింది.
కిలో వెండి ధర ఏకంగా రూ.10,500 మేర కుప్పకూలింది. ఈ 4.3 శాతం పతనంతో వెండి ధర రెండు నెలల కనిష్ట స్థాయి అయిన రూ.2,35,000 కు చేరుకుంది. అంతకుముందు ఏప్రిల్ మూడున దీని ధర రూ.2,37,000 గా ఉంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాల వల్ల డాలర్ ఇండెక్స్ 101.15 స్థాయికి పెరిగింది. ఇది గత మే తర్వాత అత్యంత గరిష్ట స్థాయి.
