‘సియర్​’ పోర్టల్ ​ద్వారా మొబైల్ ​రికవరీ

‘సియర్​’ పోర్టల్ ​ద్వారా మొబైల్ ​రికవరీ

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పోగొట్టుకున్న మొబైల్​ను సియర్ పోర్టల్ ద్వారా ట్రేస్​​చేసి పోలీసులు 24 గంటల్లో బాధితుడికి అందజేశారు. ఈ నెల18 న సాయంత్రం నగరంలోని హమాల్ వాడి ప్రాంతంలో ఖానాపూర్ కి చెందిన గండ్ల రాజు  సెల్​ఫోన్​పోయింది. వెంటనే బాధితుడు www.ceir.gov.in వెబ్​సైట్​లోకి వెళ్లి  ఫోన్​నంబర్​, పూర్తి వివరాలు అప్​లోడ్​చేశారు. దీంతో 24 గంటల వ్యవధిలో పోలీసులు రికవరీ చేయగా బుధవారం ఇన్​చార్జి సీపీ  ప్రవీణ్ కుమార్ బాధితుడు రాజకు మొబైల్ అందజేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎవరైనా మొబైల్స్​పోగొట్టుకుంటే వెంటనే ‘సియర్’ పోర్టల్ ఓపెన్​చేసి మొబైల్​నంబర్​, వివరాలు పొందపర్చాలని చెప్పారు. డీసీపీ గిరిరాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మధుసూదన్​రావు, నిజామాబాద్ ఏసీపీ  ఎమ్. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.