హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇవాళ జరగనున్న బీజేపీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీంతో స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లునగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు:
…AR పెట్రోల్ పంపు జంక్షన్ నుంచి BJR విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి వైపు
…అబిడ్స్, గన్ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను SBI గన్ఫౌండ్రి నుంచి చాపేల్ రోడ్డులో అనుమతిస్తారు
…బషీర్బాగ్ జంక్షన్ నుంచి GPOకు వచ్చే వాహనాలను హైదర్గూడ, కింగ్ కోఠి మీదుగా వెళ్లాలి
…పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్నగర్ జంక్షన్ వైపుగా వెళ్లాలి
…రాజమొహల్లా నుంచి వచ్చే వాహనాలను కింగ్ కోఠి, నారాయణగూడ వైపు
…కింగ్ కోఠి నుంచి బషీర్బాగ్కు వచ్చే వాహనాలను భారతీయ విద్యాభవన్ దగ్గర కింగ్కోఠి క్రాసు రోడ్డు తాజ్ బంజారా హోటల్ వైపు
…అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్ నుంచి హిమాయత్నగర్ రోడ్ వైపు
….ట్రాఫిక్ కంట్రోల్ రూమ్నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది
…హిల్ ఫోర్టు నుంచి వచ్చే వాహనాలను బషీర్బాగ్ వైపు అనుమతించరు. ఆ వాహనాలను PCR జంక్షన్ నుంచి నాంపల్లి రోడ్డులో పంపిస్తారు.