
ఈ నెల 18న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ వన్డే మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం వేదిక అవుతుండంతో ఫ్యాన్స్ ఈ మ్యాచ్ను చూసేందుకు ఆతృతగా ఉన్నారు. టికెట్ల విషయంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. ఈ సారి ఆఫ్లైన్ లో టికెట్లు అమ్మడం లేదని, ఆన్లైన్ లో పేటీఎంలో మాత్రమే అమ్ముతున్నామని స్పష్టం చేసింది. జనవరి 13,14,15,15,16 తేదీల్లో ఆన్లైన్ లోనే టికెట్లు అమ్మనుండగా, ఒక్కో వ్యక్తికి కేవలం 4 టికెట్లను మాత్రమే విక్రయించనున్నట్లుగా తెలిపింది.
ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వారు జనవరి 15 నుండి 18 వరకు ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఉదయం 10 నుండి 3 గంటల వరకు ఫిజికల్ టికెట్లను కలెక్ట్ చేసుకోవాలని హెచ్సీఏ తెలిపింది. మ్యాచ్కి రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరిని చెప్పింది. బ్లాక్ టికెట్ అమ్మకాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని, పార్కింగ్ ఇబ్బందులు కూడా లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది.