మెడికల్ కాలేజీల్లో మానిటరింగ్ కమిటీ తనిఖీ

మెడికల్ కాలేజీల్లో మానిటరింగ్  కమిటీ తనిఖీ

సూర్యాపేట, వెలుగు : జాతీయ మెడికల్ కమిషన్ ఆదేశాల ప్రకారం సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరిలో మెడికల్ కాలేజీలకు సంబంధించిన మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనిప్రతి మూడు మెడికల్ కాలేజీలకి కలిపి ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలనే నిబంధన మేరకు శుక్రవారం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బృందం సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను తనిఖీ చేసింది. శుక్రవారం సూర్యాపేటలోని మెడికల్ కాలేజీల్లో మానిటరింగ్​కమిటీ ఏర్పాటుపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఎంఈ సభ్యులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కాలేజీల్లో సదుపాయాలు, సిబ్బంది, కాలేజీలో అదనపు గదుల నిర్మాణాలు, విద్యార్థుల సంక్షేమంపై చర్చించారు. సమావేశంలో డీఎంఈ మెంబర్ నాగేందర్, ప్రిన్సిపాల్ జయలత, ఆస్పత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు.