నాగోలు మెట్రో స్టేషన్ వద్ద బుధవారం 30కి పైగా వెహికల్స్ స్కిడ్ అయ్యాయి. అక్కడికి సమీపంలోని బల్దియా డంపింగ్ యార్డ్ నుంచి చెత్తను తరలిస్తున్న టైంలో రోజూ వ్యర్థాలు రోడ్డుపై పడుతున్నాయి. మంగళవారం నాగోలులో తేలికపాటి వర్షం కురవడంతో వ్యర్థాలు నాని, రోడ్డంతా జిగురుగా మారింది.
విషయం తెలియని వాహనదారులు స్పీడుగా రావడంతో 5 నిమిషాల వ్యవధిలో 30కి పైగా వెహికల్స్అదుపుతప్పి ఢీకొట్టుకున్నాయి. బైక్ మీద వెళ్తున్న వారు ఎగిరి కిందపడ్డారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బల్దియా అధికారుల తీరుపై జనం మండిపడుతున్నారు.
వెలుగు,ఉప్పల్