బైక్ ను ఢీ కొట్టిన లారీ..తల్లీకొడుకు మృతి

బైక్ ను ఢీ కొట్టిన లారీ..తల్లీకొడుకు మృతి

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి RTC బస్‌డిపో  దగ్గర  ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై బైక్ ను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన గణేశ్, అతని తల్లి లక్ష్మీ అక్కడి కక్కడే చనిపోయారు. పోస్టుమార్టం కోసం గణేశ్, లక్ష్మీల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసలు తెలిపారు. గణేశ్, లక్ష్మీల మృతితో గుండంపల్లిలో విషాదం నెలకొంది.