దేవుడి మెడ‌లో టీఆర్ఎస్ కండువా..అప్పుడే కేసీఆర్ ఓటమి ఖాయం

దేవుడి మెడ‌లో టీఆర్ఎస్ కండువా..అప్పుడే కేసీఆర్ ఓటమి ఖాయం

బీజేపీ మత కల్లోహాలు సృష్టిస్తుందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. మత కల్లోహాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా..? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని.. మతాల మధ్య చిచ్చు పెట్టేది అయ్యా కొడుకులేనని..బీజేపీ కాదన్నారు. ఒక మతం పార్టీకి అమ్ముడు పోయిన కేటీఆర్ బీజేపీ  పై విమర్శలు చేయడం ఏంటన్నారు.

గాంధీ నగర్ లో లక్ష్మీగణపతి ఆలయం దర్శించుకున్న అనంతరం టీఆర్ఎస్  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..టెంపుల్ లో ఉన్న విఘ్నేశ్వరుడి విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పారు. ఈ ఘటనపై మాట్లాడిన బీజేపీ ఎంపీ..అహంకారంతోనే దేవుడికి టీఆర్ఎస్ వాళ్ళు గులాబీ కండువా కప్పారని అన్నారు.

దేవుడికి కండువా కప్పడంతోనే టీఆర్ఎస్ ఓటమి ఖారారైందని జోస్యం చెప్పారు. వరద బాధితులకు నిజంగా సాయం చేయాలన్న సంకల్పం ఉంటే నోటిఫికేషన్ ఎందుకిచ్చారు..? బాధితులను ఆదుకున్నాకనే ఎన్నికలు నిర్వహిస్తే బాగుండేదన్న ఆయన..సిరిసిల్ల కేటీఆర్ ను ఓడించాక పైశాచిక ఆనందం పొందుతామన్నారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటు వేయండని ప్రజలకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విజ్ఞప్తి చేశారు.