కేసీఆర్ మోసం చేయడం మినహా చేసిందేం లేదు

కేసీఆర్ మోసం చేయడం మినహా చేసిందేం లేదు

బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్ పూనకం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ ఎంపీ అర్వింద్ అన్నారు. అన్ని వర్గాలను మోసం చేయడం మినహా ముఖ్యమంత్రి చేసిందేమీ లేదని చెప్పారు. బీజేపీ విజయ సంకల్ప సభలో మట్లాడిన ఆయన.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీ బిడ్డను నిలబడితే కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని అర్వింద్ విమర్శించారు. ఆదివాసీలకు ఇళ్లు, భూములు, ఉద్యోగాలు ఇవ్వకుండా మాట తప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఆదివాసీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు.

తను ప్రశ్నలకు మోడీ జవాబు చెప్పాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై అర్వింద్ స్పందించారు. ముఖ్యమంత్రికి ఆయన కొడుకు, బిడ్డలే జవాబిస్తలేరని సటైర్ వేశారు. దళిత బంధు పథకాన్ని కేవలం టీఆర్ఎస్ లో పనిచేసే వాళ్లకే ఇస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. రైతులకు, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జనం బిడ్డను ఓడిస్తే ఎమ్మెల్సీని చేసిన ముఖ్యమంత్రి కొడుకుకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చి, యువతను గాలికొదిలేశాడని విమర్శించారు. ఎంఐఎంను  నెత్తిన పెట్టుకున్న  కేసీఆర్.. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ సరఫరా, మహిళలపై అఘాయిత్యాలు పెరిగినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.