సీఎం రేవంత్​ను కలిసిన ఎంపీ అభ్యర్థులు

సీఎం రేవంత్​ను కలిసిన ఎంపీ అభ్యర్థులు
  •     ఎన్నికల ప్రచారంపై సలహాలు ఇచ్చిన సీఎం
  •     ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, వంశీచందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. శనివారం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి టికెట్ రావటంలో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని సీఎం అన్నట్లు సమాచారం. లోక్​సభ స్థానం పరిధిలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, డీసీసీ అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. 

మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మీటింగ్ లు నిర్వహించాలని, ప్రజల్లోకి వెళ్లి ఆరు గ్యారంటీలను వివరించాలని  చెప్పారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే అమలు చేసిన మహాలక్ష్మి ఫ్రీ జర్నీ, ఉచిత గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ స్కీమ్ లను, త్వరలో స్టార్ట్ చేయబోయే ఇందిరమ్మ ఇంటి స్కీమ్ లను పబ్లిక్ కు వివరించాలని తెలిపారు.