హైదరాబాద్, వెలుగు : జేపీఎస్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. జేపీఎస్లు 13 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఉత్తమ్ బుధవారం లేఖ రాశారు. జేపీఎస్ల సమ్మె వల్ల గ్రామాల్లో రోజువారీ పనులు ఆగిపోయాయని, వెంటనే సర్కారు కలుగజేసుకోవాలన్నారు.
మూడేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని రూ.100 బాండ్ పేపర్ మీద సంతకాలు తీసుకుని ఉద్యోగాలిచ్చారని గుర్తు చేశారు. ప్రొబేషన్ ముగిశాక వారిని రెగ్యులర్ చేయకపోగా.. వారి ప్రొబేషన్ను మరో ఏడాది పొడిగించారన్నారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సర్కార్ బెదిరించడం ఏంటని ప్రశ్నించారు.