జేపీఎస్​లను బెదిరిస్తరా? ..కేసీఆర్​కు ఉత్తమ్ లేఖ

జేపీఎస్​లను బెదిరిస్తరా? ..కేసీఆర్​కు ఉత్తమ్ లేఖ

హైదరాబాద్, వెలుగు : జేపీఎస్​ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి డిమాండ్​ చేశారు. జేపీఎస్​లు 13 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు ఉత్తమ్​ బుధవారం లేఖ రాశారు. జేపీఎస్​ల సమ్మె వల్ల గ్రామాల్లో రోజువారీ పనులు ఆగిపోయాయని, వెంటనే సర్కారు కలుగజేసుకోవాలన్నారు.

మూడేండ్ల ప్రొబేషనరీ పీరియడ్​ ఉంటుందని రూ.100 బాండ్​ పేపర్​ మీద సంతకాలు తీసుకుని ఉద్యోగాలిచ్చారని గుర్తు చేశారు. ప్రొబేషన్ ముగిశాక వారిని రెగ్యులర్​ చేయకపోగా.. వారి ప్రొబేషన్​ను మరో ఏడాది పొడిగించారన్నారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సర్కార్​ బెదిరించడం ఏంటని ప్రశ్నించారు.