ధాన్యం కొనకపోతే పార్లమెంట్‎ని స్తంభింపచేస్తాం

ధాన్యం కొనకపోతే పార్లమెంట్‎ని స్తంభింపచేస్తాం

వడ్లు కొనకపోతే ఆమరణ దీక్ష చేస్తామని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకపోతే.. పార్లమెంట్ ని స్తంభింపచేస్తాం అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రైతు సమస్యలే కాంగ్రెస్ పార్టీకి ప్రదానమని ఆయన తేల్చిచెప్పారు. రైతు సమస్యలపైనే తమ కార్యాచరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ధాన్యాన్ని కొనాలంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన ప్రదర్శనలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు జేఏసీగా ఏర్పడినట్లు.. ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీలు జాయింట్ యాక్షన్ డ్రామా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. డ్రామాలు ఆపి ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనకపోతే కల్లాల నుంచి ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.