
మహబూబ్ నగర్ జిల్లాలో పరిషత్ ఎన్నికల ఫలితాలతో పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. మహబూబ్ నగర్, దేవరకద్ర మండలాల పరిధిలో జరిగిన గొడవల్లో ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు. దేవరకద్ర మండలం డోకూరు ఎంపీటీసీగా బీజేపీ అభ్యర్థి గెలవడంతో.. సాయంత్రం సంబరాలు జరిపారు ఆ పార్టీ కార్యకర్తలు. జులూస్ జరిగే సమయంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ ని ఇనుపరాడ్లతో కొట్టడంతో హాస్పిటల్ కు తరలించే లోపే చనిపోయాడు. అటు మహబూబ్ నగర్ మండలం రామచంద్రాపురంలోనూ టీఆర్ఎస్, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ గొడవలో అనసూయ అనే మహిళా కార్యకర్త ప్రాణాలు కోల్పోయింది.