ప్రభుత్వ లాంఛనాలతో విజయారెడ్డి దహనసంస్కారాలు..

ప్రభుత్వ లాంఛనాలతో విజయారెడ్డి దహనసంస్కారాలు..

హైదరాబాద్: నిన్న పెట్రోల్ దాడిలో మరణించిన తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు నాగోల్ లోని శ్మశానవాటికలో పూర్తయ్యాయి. భూ పట్టా ఇవ్వలేదన్న కోపంతో గౌరెల్లికి చెందిన సురేష్ అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని ఆఫీస్ లోనే పెట్రోల్ పోసి నిప్పటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమెను కాపాడబోయిన డ్రైవర్ గురునాథం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయారెడ్డి మృతిపై రెవెన్యూ సంఘాలతో పాటు, పలువులు మేధావులు, రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. దాంతో విజయారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయారెడ్డి అంతిమయాత్ర తర్వాత ఆమె భర్త సుభాష్ రెడ్డి ప్రభుత్వ లాంఛనాల మధ్య ఆమె చితికి నిప్పంటించాడు.