కాంగ్రెస్ పార్టీకే మా సంపూర్ణ మద్దతు

కాంగ్రెస్ పార్టీకే మా సంపూర్ణ మద్దతు
  • ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పాపన్న మాదిగ వెల్లడి

బషీర్ బాగ్, వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పాపయ్య మాదిగ స్పష్టం చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శనివారం సమావేశం నిర్వహించి, నిర్ణయాన్ని ప్రకటించారు. మాదిగలకు కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై చర్చించామని పాపయ్య తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్..

తమను కనీసం కలవలేదని, మాదిగలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని, దళితుల అసైన్డ్ భూములను లాక్కున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ఎస్సీ వర్గీకరణపై దాటవేత ధోరణి అవలంబిస్తోందన్నారు. మోదీ ఓట్ల కోసమే ఎస్సీ వర్గీకరణ ప్రకటన చేశారనరి, ఇన్నేండ్లు మాదిగలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్

బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని పాపయ్య మాదిగ స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు వెంకటయ్య, మేడి రమణ, మోహన్ , చింతబాబు, నాగారం బాబు, యాదగిరి, అమృత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.