ధోనీకి ప్రధాని మోడీ లేఖ.. థ్యాంక్స్ చెప్పిన మాహీ

ధోనీకి ప్రధాని మోడీ లేఖ.. థ్యాంక్స్ చెప్పిన మాహీ

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైరెన సంగతి తెలిసిందే. ధోని సేవలను గుర్తు చేసుకుంటూ సెలబ్రిటీలు, క్రికెటర్లు మెసేజ్‌లు చేస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి ప్రధాని నరేంద్ర మోడీ చేరారు. ధోని గురించి మోడీ ట్విట్టర్‌‌లో ఎమోషనల్‌గా రెండు పేజీల లెటర్‌‌ రాశారు. ‘నీ ట్రేడ్‌మార్క్‌ స్టైల్‌లో నమ్మశక్యం కాని విధంగా నువ్వు పోస్ట్ చేసిన వీడియో మొత్తం దేశానికి చర్చనీయాంశంగా మారింది. 130 కోట్ల మంది నిరుత్సాహపడ్డారు. కానీ ఇండియన్ క్రికెట్‌కు నువ్వు అందించిన సేవలకు కృతజ్ఞతలు’ అని సదరు లెటర్‌‌లో మోడీ రాశారు.

ప్రధాని మోడీ రాసిన లెటర్‌‌పై ధోని స్పందించాడు. ‘ఓ కళాకారుడు, ఒక సైనికుడు, క్రీడాకారుడు ఇలా అభినందనలతో ముంచెత్తారు.. వారి కఠోర శ్రమ, త్యాగాలను అందరూ గుర్తిస్తారు, ప్రశంసిస్తారు. మెచ్చుకోళ్లు, శుభాకాంక్షలు చెప్పినందుకు ప్రధాని మోడీకి థ్యాంక్స్’ అని ధోని ట్వీట్ చేశాడు.