IPL సీజన్-12లో సత్తాచాటుతున్న మిస్టర్ కూల్ ధోనీ..తన సింప్లిసిటీతో అందరినీ ఆకట్టుకుంటాడని మరోసారి ఫ్రూవ్ చేశాడు. ధోనీ, అతడి వైఫ్ సాక్షితో ఎయిర్ పోర్ట్ లో నేలపై పడుకున్నాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా..దటీజ్ ధోనీ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
మంగళవారం రాత్రి చెన్నై వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్తో మ్యాచ్ ఆడిన చెన్నై టీమ్.. తన తర్వాతి మ్యాచ్ ను గురువారం రాజస్థాన్ తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ జరగనుంది. రెండు మ్యాచుల మధ్యలో ఒక రోజు మాత్రమే సమయం ఉంది. దీంతో మ్యాచ్ ముగియగానే చెన్నై టీమ్ ఫాస్ట్ గా ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. కోల్ కతాతో మ్యాచ్ తర్వాత రెస్ట్ లేకపోవడంతో.. ధోని అతడి భార్య సాక్షితో కలిసి ఎయిర్ పోర్ట్ లో నేలపైనే కాసేపు కునుకు తీశారు. పక్కనే చెన్నై టీమ్ సభ్యులు కూర్చొని ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ధోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తూ.. మ్యాచ్ ముగిసిన తెల్లవారుజామునే ప్రయాణం చేయాల్సి ఉంటే.. పరిస్థితి ఇలాగే ఉంటుంది అని తెలిపాడు. దీనిపై స్పందించిన అభిమానులు.. ‘ధోనికి ఫెసిలిటీ కంటే టీమ్ గెలుపే ముఖ్యమని’ ఒకరు కమెంట్ చేయగా.. ధోని సింప్లిసిటీకి ఇది నిదర్శనం అంటూ మరో అభిమాని ట్వీట్ చేశాడు.
ప్రస్తుత IPL సీజన్ లో ధోనీ రెచ్చిపోయి ఆడుతున్నాడు. స్టంపింగ్, బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. మంగళవారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో బిగ్ విక్టరీ సాధించిన CSK… పాయింట్స్ పట్టికలో టాప్ లోనే కొనసాగుతుంది.
Doze Off ➡️ Take off! ✈️#WhistlePodu #Yellove #Repost @msdhoni pic.twitter.com/3E0jbp6YbF
— Chennai Super Kings (@ChennaiIPL) April 10, 2019