Dream11:సెలవులో ఉన్న ఉద్యోగికి ఫోన్ చేస్తే లక్ష ఫైన్

Dream11:సెలవులో ఉన్న ఉద్యోగికి ఫోన్ చేస్తే లక్ష ఫైన్

డ్యూటీ టైం ముగిసిన తర్వాత, సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న టైంలో ఆఫీస్ కాల్స్ చిరాకు తెప్పిస్తాయి. ఒక్కోసారి హాలీడే మూడ్ అంతా నాశనం చేస్తాయి. అంతేకాదు సెలవుల అనంతరం వారి పెర్ఫార్మెన్స్ పై ప్రభావం చూపుతుంది.  చాలా కంపెనీల ఉద్యోగులు ఈ సమస్య ఎదుర్కొంటుంటారు. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని ముంబైకి చెందిన ఓ కంపెనీ ఈ ప్రాబ్లెంకు చెక్ పెట్టింది. ఆఫ్ టైంలో కొలీగ్స్ ఆఫీస్ కాల్స్ తో డిస్ట్రబ్ చేస్తే భారీ ఫైన్ విధిస్తామని ప్రకటించింది. 

ముంబైకి చెందిన ఫ్యాంటసీ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్ ఫాం  డ్రీమ్ 11  ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డ్యూటీ టైం ముగిసిన తర్వాతగానీ, సెలవుల్లో ఉన్న ఎంప్లాయిస్ ను గానీ కొలీగ్స్ ఫోన్ కాల్స్ తో డిస్ట్రబ్ చేస్తే లక్ష రూపాయల ఫైన్ విధించనున్నట్లు ప్రకటించింది. ఈ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ కంపెనీ కో ఫౌండర్ భవిత్ సేత్ ఈ విషయం స్పష్టం చేసింది. 2008లో ప్రారంభమైన ఈ కంపెనీ తమ ప్రతి ఉద్యోగి ఏడాదిలో కనీసం వారం పాటు వర్క్ నుంచి ఆఫ్ తీసుకునే నిబంధన విధించింది. ఆ వారం పాటు కంపెనీకి చెందిన ఈమెయిల్స్, కాల్స్ అటెండ్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పింది. 

ఇలా చేయడం వల్ల రెండు రకాల ప్రయోజనాలున్నాయని భవిత్ చెబుతున్నారు. ఉద్యోగుల ప్రైవసీని గౌరవించడంతో పాటు కంపెనీ స్థితిగతులపై ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఏయే ఉద్యోగులపై కంపెనీ ఆధారపడుతుందన్న విషయం సులువుగా అర్థమవుతుందని చెబుతున్నారు. ఆఫీసులో చాలా రోజులుగా ఈ విధానం అమలవుతోందని భవిత్ స్పష్టం చేశారు.