కేసీఆర్ కంటే సమర్థుడినని.. రేవంత్ నిరూపించుకున్నరు : మురళీధర్ రావు 

కేసీఆర్ కంటే సమర్థుడినని.. రేవంత్ నిరూపించుకున్నరు : మురళీధర్ రావు 
  • పెద్దన్నకామెంట్లను స్వాగతించిన మురళీధర్ రావు 

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని.. ‘పెద్దన్న’ అంటూ సీఎం రేవంత్ పిలవడం సంతోషంగా ఉందని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. రేవంత్ హుందాగా ప్రవర్తించారని ప్రశంసించారు.. రాహుల్, కేసీఆర్ కంటే తాను భిన్నమని, సమర్థుడినని నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మురళీధర్ రావు మీడియాతో మాట్లాడారు.

రేవంత్ కామెంట్లు విని ఆశ్చర్యపోయానన్నారు. ఇలాంటి వైఖరి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ‘పీపుల్ ఫస్ట్, నేషన్ ఫస్ట్’ అనే ప్రధాని మోదీ నినాదాన్ని ఫాలో అవుతూ.. ‘స్టేట్ ఫస్ట్’ అనే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని చెప్పారు. పార్టీలు, సమస్యలు, ఇతర అంశాలు ఉన్నప్పటికీ... ప్రజలు, రాష్ట్రం, దేశం అనే అంశాలు వచ్చినప్పుడు పార్టీలు సెకండరీగా మారిపోతాయని అన్నారు..