అనాథ వృద్ధుడికి..అన్నీతానైన ముస్లిం మహిళ

అనాథ వృద్ధుడికి..అన్నీతానైన ముస్లిం మహిళ

అనాథలకు అన్నీ తానై బాగోగులు చూసుకోవడంతోపాటు ఓ వృద్ధుడి అంత్యక్రియలను కన్నకూతురిలా నిర్వహించిం ది సహృదయ ఆశ్రమ నిర్వాహకురాలు మహ్మద్ యాకూబీ. ముస్లిం మహిళ అయినా హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి తన ఔదార్యం చాటుకుంది. ఈ ఘటన సోమవారం భువనగిరి పట్టణంలోని రాయిగిరిలో చోటుచేసుకుంది. వివరాలు.. ధావునూరిరామయ్య అనే వృద్ధుడు గత జూన్ 26న భువనగిరి మండలంలోని కూనూరు బస్టాండ్ లో మతిస్థిమితం లేకుండా తిరుగుతూ కనిపించాడు.అనాథ వృద్ధుడిని కూనూరు ఎంపీటీసీ పాశం శివానంద్ రాయగిరిలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమానికి తీసుకెళ్లి ఆశ్రమ కోఆర్డినేటర్ ఎండీ నజీర్ మియా సమక్షంలో చేర్పిం చారు. ఇతను ఈనెల 17న ఆశ్రమంలో మరణించాడు. అతనికి బంధువులు ఎవరు లేనందున ఆశ్రమ నిర్వాహకురాలు మహ్మద్ యాకూబీ రాయగిరిలోని జింకల పార్క్ దగ్గరలో గల శ్మశాన వాటికలో దహనసంస్కారాలు నిర్వహిం చారు. కార్యక్రమంలో రాయగిరివాసులు మేడబోయిన మహేశ్‌ , కొండం ఉపేందర్, నాంపల్లి జగదీశ్వర్‌‌‌‌రెడ్డి , ఆకుల స్వామి ఉన్నారు . Read more