కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనం ప‌ల్లి

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనం ప‌ల్లి

మల్కాజిగిరి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. నేరేట్ మెట్ ఎంఆర్​ఓ ఆఫీస్​లో 136వ డివిజన్ లో 15 మందికి, 137వ డివిజన్ కు చెందిన 43 మందికి, 138వ డివిజన్​కు చెందిన 36 మందికి, 139వ డివిజన్​కు చెందిన 27 మందికి, 140వ డివిజన్​కు చెందిన 16 మందికి, 141వ డివిజన్​కు చెందిన 14 మందికి మొత్తం 151 చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంఆర్​ఓ​ మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్లు శ్రీదేవి పాల్గొన్నారు.