సమాజానికి అవసరమయ్యే మైరా

సమాజానికి అవసరమయ్యే మైరా

 కన్నడ డైరెక్టర్ స్మైల్ శ్రీను రూపొందిస్తున్న తెలుగు చిత్రం ‘మైరా’. ఈ మూవీ స్ర్కిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌ను శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారి చేత పూజా చేయించి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ సందర్భంగా రామానుజ జీయర్ మాట్లాడుతూ ‘ప్రకృతికి విరుద్ధంగా ఉంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఇప్పటి సమాజానికి ఇలాంటి సినిమా అవసరం. పాన్ ఇండియా సినిమాగా చేయండి’ అని అన్నారు. స్మైల్ శ్రీను మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని తెలుగులో ఓ స్టార్ హీరోతో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తాం’ అని అన్నాడు.