‘థ్యాంక్యూ’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్న నాగ చైతన్య, తాజాగా మరో మూవీని అనౌన్స్ చేశాడు. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఈ సినిమా గురించి ట్విటర్ ద్వారా ప్రకటించిన చైతూ.. ఎక్సైటింగ్ జర్నీ కోసం ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేశాడు. ఇది నాగచైతన్యకి ఇరవై రెండో సినిమా. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్గా నటించబోతున్నట్టు టాక్. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. స్టైలిష్ మేకింగ్తో ఆకట్టుకునే వెంకట్ ప్రభు.. చైతూతో ఎలాంటి సినిమా చేయనున్నాడో అనే ఆసక్తి నెలకొంది. దీంతో పాటు విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘దూత’ అనే హారర్ వెబ్ సిరీస్లో నటిస్తున్నాడు నాగచైతన్య. అలాగే ఆమీర్ ఖాన్తో కలిసి నటించిన ‘లాల్సింగ్ చద్ధా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.