ఆడది కాదు అనకొండ:సిగరెట్ తాగుతుంటే చూస్తావా..వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన మహిళ

ఆడది కాదు అనకొండ:సిగరెట్ తాగుతుంటే చూస్తావా..వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన మహిళ

సిగరెట్ తాగుతుంటే చూశాడని ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేసింది ఓ యువతి..ఓ పాన్ షాప్ వద్ద సిగరెట్ తాగుతున్న యువతిని ఓ వ్యక్తి తనవైపే చూశాడని కోపంతో తన స్నేహితులతో కలిసి కత్తితో పొడిచి చంపింది. నాగ్ పూర్ లో ఓ పాన్ షాపు వద్ద జరిగిన ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.   
 
24 ఏళ్ల యువతి  స్థానిక మనేవాడ సిమెంట్ రోడ్డులో శనివారం (ఏప్రిల్ 6) రాత్రి ఓ పాన్ షాప్ వద్ద సిగరెట్ తాగుతుండగా.. 28 ఏళ్ల రంజిత్ రాథోడ్ అక్కడికి వచ్చాడు. పాన్ షాప్ వద్ద సిగరెట్ తాగుతుంటే ఆమె వైపు చూసినందుకు రంజిత్ తో గొడవకు దిగింది. అది కాస్త ముదిరడంతో ఆమె ముగ్గురు  స్నేహితులను అక్కడికి రప్పించింది. ముగ్గురు కలిసి కత్తితో రంజిత్ పై దాడి చేశారు. 

పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశ్రీ అనే యువతి పాన్ షాప్ వద్ద సిగరెట్ తాగుతూ..అక్కడి వచ్చిన రంజిత్ పై పొగ ఊదడమే కాకుండా అతన్ని తిట్టింది. ఈ దృశ్యాలను రంజిత్ సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన యువతి .. తన స్నేహితులు, సవిత, ఆకాష్ రౌత్, జీతు జాదవ్ లను  రప్పించి కత్తితో దాడి చేసింది. ఇదంతీ సీసీటీవీ పుటేజ్ లో రికార్డయింది. 

నిందితులకోసం గాలింపు వెతికిన పోలీసులు చివరికి  జయశ్రీ, సవిత , ఆకాష్ లను పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో రంజిత్ రాథోడ్ ఫోన్ లోని ఫుటేజీలు, సీసీటీవీ ఫుటేజీలే కీలక సాక్ష్యంగా పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. నిందితులు నివాసం ఉంటున్న దత్తవాడిలో వారి ఇంట్లో సోదాలు నిర్వహించగా నిందితురాలు డ్రగ్స్ తీసుకుంటున్న ఫొటోలు ఉన్న పోన్ బయటపడింది. 

ఈ హత్యను రిటైర్డ్ ఉద్యోగి ఒకరు చూశారు. అర్థరాత్రి వరకు పాన్ షాపులు తెరిచి ఉంచడం వల్లే ఇలాంటి దారుణాలు, సంఘ విద్రోహ చర్యలు జరుగుతున్నాయని అంటున్నారు స్థానికులు.