పిల్లలతో భిక్షాటన చేయిస్తే చర్యలు : ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి

పిల్లలతో భిక్షాటన చేయిస్తే చర్యలు  : ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి

నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లాలో చిన్న పిల్లలతో ఎవరైనా భిక్షాటన చేయిస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి హెచ్చరించారు. నల్గొండలో చిన్నపిల్లలతో భిక్షాటన చేస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం, పోలీస్ శాఖ, ఏహెచ్ టీయూ సిబ్బంది ఆధ్వర్యంలో బస్టాండ్, గడియారం సెంటర్, సినిమా థియేటర్స్, మసీద్ లు, రైల్వే స్టేషన్, ఎన్జీ కళాశాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భిక్షాటన చేస్తున్న 17 మందిని గుర్తించామని, వారిని సఖి సెంటర్ కు తరలించామన్నారు. అనాథలైన చిన్నారులను వృద్ధాశ్రమానికి తరలించామని, మరి కొంతమంది పిల్లలకు సంబంధించిన బంధువులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. తనిఖీల్లో జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యుడు మోహన్ రావు, టూ టౌన్ ఎస్ఐ మానస, బీఆర్ సీ కో–ఆర్డినేటర్ హరిత, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి గణేశ్, ఎఫ్ఆర్ వో నాగిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.