నల్గొండలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

నల్గొండలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండలోని హైదరాబాద్‌ రోడ్డులో ఎస్పీ ఆఫీసు నుంచి బైపాస్ రోడ్డు వరకు ఉన్న వివిధ హోటళ్లలో  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ప్రత్యేక తనిఖీ చేపట్టారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎన్‌ శివ శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను అమ్మరాదని సూచించారు. 

నల్గొండలోని రాఘవేంద్ర భవన్, ప్రసాద్ ఉడిపి హోటల్, నందిని కిచెన్, రాజస్థాన్ టీ స్టాల్, చార్మినార్ కేఫ్, బెల్లం టీ, టీ టైం, ఆఫిజ్ పాన్ షాప్, జగారి అడ్డా, రోడ్డు పక్కన టీ స్టాళ్లలో నమూనాలను సేకరించి ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ కు పరీక్షలకు పంపినట్లు  యాదాద్రి జోన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి తెలిపారు. ఈ తనిఖీలో ల్యాబ్ టెక్నీషియన్ ఎం వెంకటపతి, పాల్గొన్నారు.