పెండింగ్ కేసులు త్వరగా క్లియర్ చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్

పెండింగ్ కేసులు త్వరగా క్లియర్ చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
  • ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

నల్గొండ అర్బన్, వెలుగు : పెండింగ్ కేసులను త్వరగా క్లియర్ చేసి, కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్గొండలోని ఎస్పీ కార్యాలయంలో నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని చెప్పారు. పోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్​మెంట్ తెలిసి ఉండాలని, అవసరమైతే న్యాయమూర్తులను కలిసి కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.

 దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100పై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అడిషనల్ ఎస్పీ రమేశ్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖర్ రాజు,సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.