జగన్ భార్య భారతిని కలిసిన నమ్రత

జగన్ భార్య భారతిని కలిసిన నమ్రత

హీరో మహేష్ బాబు ఏపీలోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామాభివృద్ధి కోసం మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే బుర్రిపాలెంను మరింత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో శుక్రవారం ఏపీ సీఎం జగన్ భార్య భారతిని కలిశారు నమ్రత.

బుర్రిపాలెం అభివృద్ది పనుల గురించి భారతితో నమత్ర చర్చించారు. భవిష్యత్‌ లో ప్రభుత్వం,గ్రామం ఫౌండేషన్ రెండు కలిసి బుర్రిపాలెం అభివృద్ది కోసం పనిచేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ బాబు చేపడుతున్న స్వచ్చంద కార్యక్రమాలను వైఎస్ భారతి ప్రశంసించినట్టు సమాచారం. గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామం మహేష్ బాబు తండ్రి హీరో కృష్ణ స్వగ్రామం అనే సంగతి తెలిసిందే.