
‘అఖండ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న తర్వాత...గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ 107వ సినిమా చేస్తున్నారు. బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తున్నారు. సినిమా సెట్స్ నుంచి ఓ స్పెషల్ ఫొటోలను డైరెక్టర్ మలినేని విడుదల చేశారు. బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 48 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్పెషల్ ఫొటోను ట్వీట్ చేశారు. ఈ ఫొటోను చూసిన బాలకృష్ణ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతూ... వైరల్ చేస్తున్నారు. షూటింగ్ లోకేషన్ నుంచి బాలయ్య, శృతిహాసన్ లతో గోపిచంద్ సెల్ఫీ ఫొటో తీసుకున్నారు. కీలక షెడ్యూల్ ఇస్తాంబుల్ లో స్టార్ట్ అయినట్లు వెల్లడించారు.
ప్రముఖ నటులతో కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. కోలీవుడ్ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ - మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనిల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ లు భారీ ఎత్తున సినిమాను రూపొందిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అందించారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ వైవిధ్యమైన పాత్రను పోషించారని తెలుస్తోంది.
#NBK107????#48GloriousYearsOfNBK. #Godofmasses ? @shrutihaasan @MythriOfficial pic.twitter.com/xyIcaj95dV
— Gopichandh Malineni (@megopichand) August 30, 2022