ఇవ్వాల తెలంగాణకి మోదీ .. నారాయణపేట, హైదరాబాద్ సభలకు అటెండ్

ఇవ్వాల తెలంగాణకి మోదీ .. నారాయణపేట, హైదరాబాద్ సభలకు అటెండ్

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని మోదీ మరో సారి రాష్ట్రానికి రానున్నారు. శుక్రవారం ఆయన నారాయణపేటతో పాటు ఎల్బీ స్టేడి యంలో జరిగే పబ్లిక్ మీటింగ్​లకు అటెండ్ కానున్నారు. మహబూబ్ నగర్​ అభ్యర్థి డీకే అరుణ తరఫున ఎన్నికల ప్రచారానికి గాను శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు కర్నాటక నుంచి  నారాయణ పేటకు మోదీ చేరుకోనున్నారు.

 3.15 గంటల నుంచి 4.05 గంటల వరకు అక్కడ జరిగే బహి రంగ సభలో పాల్గొని ప్రసంగిం చను న్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం5.15 గంటలకు హైద రాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం 5.30 గం టల నుంచి 6.20 గంటల వరకు ఎల్బీ స్టేడి యలో జరిగే సభలో పాల్గొం టా రు. సభ కు హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మ ల్కాజ్​గిరి పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోని కార్యకర్తలు అటెండ్​ కానున్నారు.