బషీర్బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ వల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని నేషనల్ అంబేద్కర్ సేన, మాల మహానాడు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరగూడ ఎన్ఎస్ఎస్లో నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్రావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ మాట్లాడారు.
గ్రూప్ 3లోని 26 కులాలకు రోస్టర్ పాయింట్ను 16గా నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామనిహెచ్చరించారు.
