పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాలకు జాతీయ అవార్డు

పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాలకు జాతీయ అవార్డు

పెద్దపల్లి/సిద్దిపేట, వెలుగు: స్వచ్ఛతలో పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాలు జాతీయ అవార్డును దక్కించుకున్నాయి. ఈ నెల 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవం రోజున ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని ఆయా జిల్లాల కలెక్టర్లు శుక్రవారం మీడియాకు తెలిపారు. మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన పెంపొందించడం, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం, స్వచ్ఛ్ భారత్ మిషన్ లో కనబర్చిన ప్రదర్శన ఆధారంగా దేశవ్యాప్తంగా 20 జిల్లాలను అవార్డులకు ఎంపిక చేశారు. అందులో మన రాష్ట్రం నుంచి పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాలు ఎంపికయ్యాయి. కరోనా నేపథ్యంలో అవార్డు ప్రదానోత్సవాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆన్​లైన్​లో నిర్వహించనుంది. స్వచ్ఛతలో పెద్దపల్లి జిల్లాకు ఇప్పటికే 4 జాతీయ స్థాయి అవార్డులు లభించగా లేటెస్ట్ గా మరో అవార్డు వచ్చింది. సిద్దిపేట జిల్లాకు జాతీయ అవార్డు సాధన దిశగా కృషి చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు  సిద్దిపేట జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అభినందనలు తెలిపారు.