
డిజిటల్ శకం మన చుట్టూ ఉన్న ప్రతిదాన్నీ మార్చేస్తోందని, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలకు కొత్త అర్థాలు చెబుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సమాజానికి టెక్నాలజీ కొత్త నిర్వచనం ఇచ్చిందని చెప్పారు . అయితే పాలన , నీతి, చట్టం, హక్కులు , భద్రతపై టెక్నాలజీ కొత్త ప్రశ్నలను, సవాళ్లను లేవనెత్తుతోందన్నారు మోడీ. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ది సిడ్నీ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పాల్గొన్నారు. ఇండియా టెక్నాలజీ: ఎవల్యూషన్ అండ్ రివల్యూషన్ పై కీలక ప్రసంగం చేశారు. క్రిప్టో కరెన్సీపై దేశాలన్నీ కలిసి పనిచేయాలని, అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని పిలుపు ఇచ్చారు.