పంజాబ్ కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. చన్నీ, సిద్ధూ మధ్య తీవ్రంగా పోటీ నెలకొంది. ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలా అనే విషయంపై అధిష్టానం తర్జనభర్జన పడుతుంది. అయితే ఇద్దరు నేతలు సీఎం అభ్యర్థిపై ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరిలో ఎవరిని ప్రకటించినా ఫర్వాలేదని పైకి చెబుతున్నా వారి మనసులో మాటను బయటపెట్టడం లేదు. కానీ సిద్ధూ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తాను సహాయక నటుడిని కాదని తన మనసులో మాటను బయటపెట్టారు సిద్ధూ. అంటే పరోక్షంగా సిద్ధూను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోతానని పరోక్షంగా హెచ్చరించినట్టేనని చెబుతున్నారు రాజకీయ నిపుణులు.
మరిన్ని వార్తల కోసం
రిపబ్లిక్ డే: తివిధ దళాల్లో బెస్ట్ పరేడ్ విన్నర్గా నేవీ
అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరీపై కేసు నమోదు