
నవదంపతులు విఘ్నేశ్ శివన్ ,నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు.నవదంపతులను చూడటానికి అభిమానులు, భక్తులు ఎగబడ్డారు. నిన్న(గురువారం) తమిళనాడులోని మహాబలిపురంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది ఈ ప్రేమజంట. ఏడడుగులు వేసి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ కపుల్ ను విష్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహ వేడుకకు సూపర్స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, ప్రముఖ నిర్మాత బోణీ కపూర్, దర్శకుడు అట్లీ, రాధికా శరత్ కుమార్, విజయ్ సేతుపతి, కార్తి, పలువురు రాజకీయ ప్రముఖులు సైతం హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.