తాత్కాలికంగా సఫారీ పార్కు మూసివేత

తాత్కాలికంగా సఫారీ పార్కు మూసివేత

హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ఉన్న సఫారీ పార్కును అధికారులు ఇవాళ్టి నుంచి తాత్కాలికంగా మూసివేశారు. మీరాలం చెరువు వరద కారణంగా ఈ పార్కు జలమయమైంది. దీంతో జంతు సంరక్షణను దృష్టిలో పెట్టుకొని సఫారీ పార్కును మూసేశారు. మీరాలం చెరువు నుంచి వచ్చే నీటిలో పారిశ్రామిక వ్యర్ధాలు ఉన్నాయని, ఆ నీరు తాగితే జంతువులకు ప్రమాదాన్ని అధికారులు చెప్పారు. సఫారీ పార్కును ఎప్పుడు తెరిచేది తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.