మనిషి కోసం తపించి, ప్రాణత్యాగం చేసిన మహనీయులను మరిచిపోవద్దన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన మహా వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తార్నాకలో నేతాజీకి ఈటల నివాళులర్పించారు. నేతాజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. ఆయన త్యాగాన్ని రాబోయే తరాలకు అందించేందుకే భారత ప్రభుత్వం అమృతోత్సవాలను జరుపుకొంటోందన్నారు.
స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు చేసిన సుభాష్ను కాంగ్రెస్ మరిచిపోయేలా చేసిందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. స్వాతంత్య్రం కోసం బలిదానాలు చేసిన వారిని స్మరించుకునే కార్యక్రమం బీజేపీ చెప్పట్టిందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి సందర్భంగా నేతలు నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ గురించి ప్రస్తుత యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాజాసింగ్ అన్నారు.
Paid floral tributes to #NetajiSubhashChandraBose Ji on his 125th Birth Anniversary at @BJP4Telangana State office. pic.twitter.com/9jlp4qmXRl
— Raja Singh (@TigerRajaSingh) January 23, 2022
For More News..