లాక్ డౌన్ మ‌ళ్లీ పెట్టాలంటూ గ‌వ‌ర్న‌ర్ ను కోరిన నెటిజ‌న్లు

లాక్ డౌన్ మ‌ళ్లీ పెట్టాలంటూ గ‌వ‌ర్న‌ర్ ను కోరిన నెటిజ‌న్లు

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో మంగళవారం సమీక్ష జరపనున్నట్లు గవర్నర్ తమిళిసై ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ కి పలువురు నెటిజన్లు స్పందించారు. హైదరాబాద్ ‌లో కరోనా వ్యాప్తి దారుణంగా ఉందని, లాక్ డౌన్ విధించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఓ నెటిజన్ గవర్నర్ ‌ను కోరారు.

కరోనా వ్యాప్తి, పరీక్షలు, ట్రీట్ మెంట్ విషయంలో చొరవ చూపాలని మరో నెటిజన్ కోరారు. దీనికి స్పందించిన గవర్నర్ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో ప్రైవేటు ఆస్పత్రులు ప్రజల రక్తం తాగుతున్నాయని మరో నెటిజన్ తెలిపారు. హైదరాబాద్ లోని పలు ఆస్పత్రుల్లో ఖాళీ బెడ్ల వివరాలను తెలియపరిచేలా చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ కోరారు. రాష్ట్రంలో రోజుకు ఐదారువేల పరీక్షలే జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలని గవర్నర్ ‌ను పలువురు నెటిజ‌న్లు కోరారు.