విశాఖ‌ప‌ట్నంలో విషాదం: పెళ్లి, ప్రేమ‌.. ఆపై ఆత్మ‌హ‌త్య

విశాఖ‌ప‌ట్నంలో విషాదం: పెళ్లి, ప్రేమ‌.. ఆపై ఆత్మ‌హ‌త్య

విశాఖపట్నం : భర్తనుండి విడిపోయిన ఓ మ‌హిళ‌ మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. ఆమె నుంచి విడిపోయిన భర్త కూడా ఈ ప్రేమ పెళ్లిని తట్టుకోలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. త‌మ ప్రేమపెళ్లిని అంగీకరించలేదని ఆ కొత్త జంట కూడా ఆత్మహత్య చేసుకుంది.ఈ విషాద ఘటన విశాఖట్నంలోని సుందరయ్య కాలనీలో గురువారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖలోని సుందరయ్య కాలనీకి చెందిన నాగిణికి ఐదేళ్ల క్రితం పాపారావు అనే వ్యక్తితో వివాహమైంది. ఏడాది క్రితం భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్న ఆమెకి అభిలాష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. మూడు రోజుల క్రితం వారు వివాహం చేసుకున్నారు. విష‌యం తెలిసిన పాపారావు త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ప్రేమ‌ పెళ్లి చేసుకొని, పెద్దలను ఎదురించి బ్రతకలేక నాగిణి, అభిలాష్ లు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.