ఈ నెల నుంచి కొత్త కరెంట్ బిల్లులు

ఈ నెల నుంచి కొత్త కరెంట్ బిల్లులు

మీటర్‌ రీడింగ్‌ షురూ.. 3 నెలలకు యావరేజ్ బిల్లులు
గతేడాది మార్చి, ఏప్రిల్ బిల్లును
బట్టి ఈసారి అంచనా బిల్లు

హైదరాబాద్‌, వెలుగు: లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన కరెంట్ మీటర్ ‌రీడింగ్‌,  బిల్లుల జారీ మంగళవారం నుంచి మొదలైంది. కరోనా వ్యాపించకుండా సర్కారు తీసుకున్న చర్యల్లో భాగంగా ఏప్రిల్ నెల నుంచి మీటర్ రీడింగ్ తీయలేదు. విద్యుత్‌నియంత్రణ మండలి పర్మిషన్‌మేరకు కిందిటేడాది ఏప్రిల్, మే నెలల బిల్లుల ప్రకారం, ఈ ఏడాది ఈ రెండు నెలలకు అంచనా బిల్లులు చెల్లించే అవకాశం కల్పించారు. లాక్‌డౌన్‌సడలించినందున మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్‌సిబ్బంది ఇంటింటికి వచ్చి మీటర్‌రీడింగ్‌తీస్తున్నారు.

మార్చి, ఏప్రిల్, మే నెలలకు యావరేజ్..

మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి వాస్తవ బిల్లులను రీడింగ్‌తీస్తున్నారు. ఇప్పటికే మార్చి, ఏప్రిల్‌నెలలకు సంబంధించిన అంచనా బిల్లులు చెల్లించిన వారి వివరాలు, చెల్లించనివారి వివరాలన్నీ బిల్లింగ్‌మెషీన్లలో డేటా లోడ్‌చేశారు. మార్చి, ఏప్రిల్, మే  నెలల్లో వాడిన కరెంటుకు మీటర్ రీడర్లు మొత్తం రీడింగ్‌ను తీస్తున్నారు. ఆ తర్వాత వాడిన కరెంటు మొత్తం యూనిట్లను మూడు నెలలతో భాగించి ఒక్క నెలకు ఎంత చెల్లించాలో యావరేజ్ లెక్కించి అసలు బిల్లు ఇచ్చేటట్లు సాఫ్ట్ వేర్‌ను రెడీ చేశారు.

కరెంట్ ‌మీటర్ ‌రీడర్లకు రెండు నెలల జీతం

కరెంట్‌మీటర్‌రీడింగ్‌తీసే సిబ్బందికి రెండు నెలల జీతం ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌లభించింది. రెండు నెలలుగా మీటర్‌రీడింగ్‌చేపట్టకపోవడంతో రీడర్లకు వేతనాలు ఇవ్వలేదు. ఈ నెల నుంచి విద్యుత్‌సంస్థలు మీటర్‌రీడింగ్‌చేపట్టాయి. దీంతో 1800 రీడర్లకు నెలకు రూ.3 వేల చొప్పున ఏప్రిల్‌, మే నెలలకు చెల్లించాలని విద్యుత్‌సంస్థలు ఆదేశించాయి. ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ రిజిస్ట్రేషన్‌అయిన వారికి మాత్రమే ఈ రెండు నెలల జీతం లభించనుంది.

గైడ్ లైన్స్…

ఇప్పటికే మార్చి, ఏప్రిల్ నెలల్లో చెల్లించిన బిల్లులను వాస్తవ బిల్లు నుంచి తగ్గించి ఈ నెల బిల్లు జారీ చేస్తారు.

ఒకవేళ మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి జారీ చేసిన అంచనా బిల్లులు ప్రస్తుతం ఇచ్చే వాస్తవ బిల్లు కంటే అధికంగా ఉంటే మైనస్ బిల్లు ఇస్తారు.

తక్కువ ఉంటే ఎంత చెల్లించాలో అంత మేరకు బిల్లులు ఇస్తారు.

ఇప్పటికే చెల్లించిన బిల్లు ఎక్కువగా ఉండి మైనస్ బిల్లు ఇస్తే.. ఎంత ఎక్కువ చెల్లించారో ఆ మొత్తాన్ని తర్వాత నెలల్లో వచ్చే బిల్లులో అడ్జెస్ట్‌‌చేస్తారు.

రీడర్లు ఇండ్లు, ఆఫీసులు, షాపులకు వెళ్లి మీటర్‌‌రీడింగ్ తీసేటప్పుడు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు మస్ట్‌‌గా వాడాలి.

For More News..

పరిహారం అడిగిండని రైతును స్టేషన్ల పెట్టిన్రు

‘టీమిండియాను చూసే నేర్చుకున్నాం’