కూసుమంచి, వెలుగు: కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోని సాగర్ ఇన్ ఫ్లో కాలువకు మంగళవారం కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఈ గేట్లను ఏర్పాటు చేశారు.
ఖమ్మం- సూర్యాపేట రాష్ట్ర రహదారిని బంద్చేసి పనులు జరిపించారు. కార్యక్రమంలో మానిటరింగ్ డీఈ వెంకట్రామిరెడ్డి, జేఈ, లష్కర్లు వెంకన్న, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
